Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్ఫూర్తి కళాశాల చైర్మెన్ రాపర్తి సురేష్ గౌడ్
నవతెలంగాణ-ఉప్పల్
స్ఫూర్తి మహిళా డిగ్రీ కళాశాల వార్షికోత్సవాలను మంగళ వారం ఘనంగా జరుపుకున్నారు. ఆ కళాశాల చైర్మెన్ సురేశ్గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులందరూ ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని సూచించారు. అంతేకాకుండా క్రమశిక్షణకు మారుపేరుగా విద్యార్థులు అందరూ కలిసిమెలిసి మెలగాలని ఆయన ఆకాంక్షించారు. కళాశాలలో చదివిన విద్యార్థులు అందరూ పలు బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు సాధించడం ఆనందంగా ఉందన్నారు.
కరోనా వైరస్ విజంభిస్తున్న నేపథ్యంలో విద్యాసంస్థలకు ఇబ్బందులు ఎదురైనప్పటికీ తమ కళాశాల విద్యార్థులు ఎంతో క్రమశిక్షణతో ఆన్లైన్లో క్లాసులను సద్వినియోగం చేసుకున్నారు. ఓవైపు డిగ్రీ పూర్తయిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నా మరోవైపు ఉద్యోగాలను పొందుతున్నారు. స్పూర్తి కళాశాల అంటేనే శిక్షణకు క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తోంద న్నారు. ఇంతటి ఘనత సాధించడంలో లెక్చరర్ల కషి మరువలేనిదని అన్నారు. చదువుతో పాటు ఆటపాటల్లోనూ రాణించడం అభినందనీయమన్నారు. విద్యార్థుల విజయాలకు నాందిగా స్ఫూర్తి కళాశాల నిలవడం విశేషమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా డిగ్రీ చివరి సంవత్సరం పూర్తి అయిన విద్యార్థులకు పట్టాలను అందజేశారు. విద్యార్థుల సాంస్కృ తిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ర్యాంపు వాక్ అలరించింది. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జ్యోతి, లెక్చరర్లు విజయలక్ష్మి, బాస్ శైలజ, చంద్రకళ, రవి, చైతన్య, క్రాంతి, ఫరీదా, అనూష, మాధవి, విజయలక్ష్మి పాల్గొన్నారు.