Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైర్మెన్ బోయపల్లి కొండల్ రెడ్డి
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
ఆత్మస్థైర్యం పెంపొందించుకోడానికి కరాటే ఎంతో దోహదపడుతుందని చైర్మెన్ బోయపల్లి కొండల్ రెడ్డి అన్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నోజిగూడ ఎస్టీ కమ్యూనిటీి భవనంలో ఆదివారం జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా, మేడ్చల్ జిల్లా షోటోకన్ కరాటే జిల్లా చీఫ్ గుగులోత్ గోవింద్ నాయక్ ఆద్వర్యంలో 50 మంది కరాటే విద్యార్థులకు బెల్ట్ టెస్టింగ్ పోటీలు నిర్వహించి అనంతరం విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్లు చైర్మెన్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు విన్యాసాలు ప్రదర్శించారు. అనంతరం చైర్మెన్ మాట్లాడుతూ కరాటే వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, కరాటే వలన మహిళలలో ఆత్మస్థైర్యం ఏర్పడి, ఆకతాయలను ఎదుర్కోగలరని అన్నారు. శారీరక మానసిక ఎదుగుదల తోడ్పడుతుందని, శారీరక దారుఢ్యం పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మెన్ నానావత్ రెడ్యా నాయక్, స్థానిక కౌన్సిలర్ చింతల రాజశేఖర్, టీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శులు నల్లవెల్లి శేఖర్, కొమ్ముల ప్రశాంత్, నాయకులు బోయపల్లి సత్తిరెడ్డి, బోయపల్లి రాజేశ్వర్ రెడ్డి, జితేందర్ నాయక్, కే.ఎం.రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, నల్లవెల్లి మురళి, లక్ష్మణ్ యాదవ్, లోకేష్రెడ్డి, కరాటే అసోసియేషన్ సభ్యులు రాత్లవత్ సంతోష్ నాయక్, ఆర్.కోమల్, ఎన్.నాగరాజు, సాయి మణికంఠ రెడ్డి, సాయి కిరణ్, అక్షరు కుమార్, తదితరులు పాల్గొన్నారు.