Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి 42 రోజులుగా విద్యుత్ సరఫరా లేక అనేక ఇబ్బందులు పడుతున్నా ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు పట్టించుకోవడంలేదని, వారి తీరుకు నిరసనగా వీసీ లాడ్జ్ బస్తీవాసులు ఆదివారం తార్నాకలోని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈసందర్భంగా పలువురు బస్తీవాసులు మాట్లాడుతూ తమ ఒక్క బస్తీకే రాత్రి పూట విద్యుత్ ఇస్తూ రోజంతా విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ వివిధ రకాలైన నిరుపేదలు, నిత్య కూలీలే ఉన్నారని వృద్ధులు, చిన్న పిల్లలు, అనేక వైరల్ ఫీవర్స్కు గురయ్యారన్నారు. విద్యుత్ను వెంటనే పునరుద్ధరించాలని, లేకపోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దీనిపై డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి స్పందిస్తూ ఓయూ వీసీ రవీందర్ యాదవ్తో మాట్లాడి రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీటీయూసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఖాజా పాషా, యాకుబ్, ఆనంద్, రామకృష్ణ, అరుణ్, సరిత, లక్ష్మి, స్వాతి, అబ్జల్ బేగం, బస్తీవాసులు పాల్గొన్నారు.