Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణు-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన బీసీి వర్గాల ఆత్మగౌరవం కోసం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం అబ్దుల్లాపూర్మెట్లో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మహాజన గర్జన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ హాజరయి ప్రసంగించారు. సమాజానికి తొలి గురువులుగా, వ్యవసాయ పనుల్ని, పనిముట్లను వత్తి పనుల్లో ప్రథములుగా విశ్వబ్రాహ్మణుల సేవలు మరవలేనివన్నారు. పంచవత్తులు నిర్వహించే స్వర్ణకార, వడ్రంగి, కమ్మరి, కంసాలి, శిల్పులు కులవత్తే ఆధారంగా జీవనం కొనసాగిస్తున్నారని, ఒకే గొడుగు కింద ఎక్కువ మంది ఉన్న విశ్వబ్రాహ్మణుల ఆత్మగౌరవాన్ని ఇనుమడించేందుకు అత్యధికంగా ఉప్పల్ బగాయత్లో ఐదు ఎకరాల స్థలంతో పాటు, ఐదు కోట్లను కేటాయించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. వెనుకబడిన వర్గాలు ఎన్నో ఏళ్లుగా ఆత్మగౌరవ భవనాల కోసం విజ్ణప్తి చేసినా ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేదని, కోకాపేట్లో వేలకోట్లు విలువ చేసే స్థలాల్ని, 84 ఎకరాల్ని హైదరాబాద్లో 40 బీసీ కులాలకు కేటాయించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఈ రోజు విశ్వబ్రాహ్మణులకు ఉప్పల్ బగాయత్లో కేటాయించిన భూమి పత్రాల్ని ఎమ్మెల్సీగా ఎన్నికైన బిక్షపతికి అందించి అభినందనలు తెలిపారు. విశ్వబ్రాహ్మణులంటేనే త్యాగాలకు ప్రతీకన్నారు. తెలంగాణ శ్వాసగా బతికిన ప్రొఫెసర్ జయశంకర్ సార్, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అమరుడైన శ్రీకాంతాచారి విశ్వబ్రాహ్మణులకే కాదు తెలంగాణకే గర్వకారణమన్నారు. అంతటి త్యాగాల వారసులుగా మీరందరూ సమావేశానికి హాజరై అబ్దుల్లాపూర్మెట్ పునీతమైందన్నారు. ఇన్నేళ్లలో ఏ ప్రభుత్వం విశ్వబ్రాహ్మణుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని, దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్లైనా, ఎన్నో ప్రభుత్వాలు మారినా, మన జీవితాల్లో మార్పులు రాలేదని, వెనుకకు నెట్టేయబడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం స్వరాష్ట్రం వచ్చాకే అత్యధిక సంక్షేమం అందిస్తుందన్నారు. ఎవరు అన్నంపెట్టినా వారికి అండగా నిలిచే గుణం బీసీలదన్నారు. కేవలం 16 మాత్రమే బీసీి గురుకులాలు తెలంగాణకు ముందు ఉంటే 281 గురుకులాల్ని ఏర్పాటు చేసుకొని లక్షా 40వేల విద్యార్థుల్ని చదివిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. రాబోయే రోజుల్లో విశ్వబ్రాహ్మణుల న్యాయబద్ధమైన ప్రతీ కోరికను గౌరవ ముఖ్యమంత్రి దష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుందామని హామీనిచ్చారు. పనిచేసే ప్రభుత్వానికి మద్దుతుగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం నలుమూలల నుండి తరలొచ్చిన వేలాది విశ్వబ్రాహ్మణులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్రోజు బిక్షపతి చారి, ప్రధాన కార్యదర్శి తల్లోజు చెన్నయ్య చారి, సంతోష్ చారి, రవీంద్ర చారి, పెద్దఎత్తున విశ్వబ్రాహ్మణులు తదితరులు పాల్గొన్నారు.