Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాదేవపూర్
మహాదేవపూర్-కాళేశ్వరం ఆర్ అండ్ బి రోడ్డు మొత్తం గుంతలమయమైంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. అయినా ఆర్ అండ్ బి అధి కారు లు పట్టించుకోవట్లేదని పలువురు వాహన దారులు ఆరోపిస్తున్నారు. ఓవర్లోడ్ ఇసుక లారీలతో రోడ్డు గుంతలమయమైందని, పలుమార్లు సంబంధిత అధికారులకు విన్న వించినా పట్టించుకోవడం లేదని ఆరోపి స్తున్నారు. నిత్యం కాలేశ్వరం దేవస్థానానికి వచ్చే సందర్శకులతోపాటు మహారాష్ట్రకు వెళ్లే వాహనదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఆర్అండ్బీ అధికారులు పట్టించుకుని రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని మండల వాసులు కోరుతున్నారు.