Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
గ్రామాల సంక్షేమం, అభివృద్దే తన లక్ష్యమని, అందుకు తగినన్ని నిధులు తీసుకొస్తానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని లష్కర్ గూడ, అబ్దుల్లాపూర్, గుంతపల్లి, మజీద్ పూర్, బాట సింగారం, జాఫర్ గూడ, ఇనాం గూడ గ్రామాల్లో నాలుగు కోట్ల అరవై లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు లు, భూగర్భ డ్రయినేజీ, కమ్యూనీటి హాల్స్, అంగన్ వాడి భవనం తదితర అభివృద్ధి పనులను రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి, ఎంపిపి బుర్ర రేఖ మహేందర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని, పల్లె ప్రగతి ద్వారా అనేక గ్రామాలు అభివద్ధి సాధిస్తున్నాయని అన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాల్సిన అవసరం ఉందని అందుకు తగ్గట్లుగా మరిన్ని నిధులు తీసుకొస్తానని హామిచ్చారు.బాట సింగారం లోని పురాతన కట్టడడంను పు న: ప్రారంభించారు. గుంతపల్లి లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ దేవేందర్ రెడ్డి, ఎంపిఓ వినోద, పంచాయతీ రాజ్ ఎఇ శ్రీనివాస్ రెడ్డి, జడ్పిటిసి బింగి దాస్ గౌడ్, వైస్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, సర్పంచులు తుడుము మల్లేష్, చెరుకు కిరణ్ కుమార్, కరిమెల వెంకటేష్, పారిజాత శేఖర్, లత శ్రీ గౌరీ శంకర్ చారి , కొర్ర లావణ్య రాధాకష్ణ , అంతటి యశోదా ఊషయ్య, ఎంపిటిసిలు మేడిపల్లి బాలమణి , తాటిపల్లి సౌమ్య రమేష్, గ్యార బాలలింగస్వామి, కేసెట్టి వెంకటేష్, మండల కో అప్షన్ సభ్యులు ఎండి గౌస్ బాషా, ఉప సర్పంచ్ గడ్డం బాలకిషన్, వార్డు సభ్యుడు మొగుళ్ళ జీవన్ రెడ్డి, తాటిపల్లి రమేష్, గ్రామ కార్యదర్శులు శ్రీనివాస్, జమిల్, వివిధ విభాగాల అధికారులు, పలు గ్రామాల వార్డు సభ్యులు, టిఆర్ఎస్ నాయకులు ముద్దం వీరస్వామి, రవి, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.