Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
రాష్ట్ర ప్రభుత్వం విశ్వబ్రాహ్మణులకోసం ప్రత్యేక భవనం నిర్మించడానికి 5 ఎకరాల భూమిని కేటాయించిన సందర్భంగా ఆ సంఘం బాలానగర్ మండల అధ్యక్షుడు సుతారి చిరంజీవిచారి హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం జరిగిన విశ్వకర్మ మహా గర్జన సభలో ప్రభుత్వం రాష్ట్రంలోని 84 వెనకబడిన కులాలకు సీఎం కేసీఆర్ 90 ఎకరాలు, రూ. 5 కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా 50 ఏండ్లు నిండిన వారికి ఫించన్లు, యంత్రాలు, ముడిసరుకులను అందించేందుకు ప్రభుత్వం చేయూత నివ్వడం అభినందనీయమన్నారు. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్రోజు బిక్షపతి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు భాషపల్లి రమేష్చారి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు పి. జయరాములు చారి, చిరంజీవి చారి, పి.మోనప్పచారి, యన్. బాలకష్ణ చారి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.