Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హస్తినాపురం
నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే సుధీర్రెడ్డి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎల్బీనగర్ ఇన్చార్జి మల్ రెడ్డి రాంరెడ్డి అన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు హస్తినాపురం డివిజన్ పరిధిలోని నందనవనంలో ఆ పార్టీ డివిజన్ అధ్యక్షుడు దెంది శశిధర్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఇరిగి రమేష్, లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్రెడ్డి, సంకేపల్లి సుధీర్రెడ్డి, కిరణ్యాదవ్, అజార్ల ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమంలో మల్రెడ్డి రాంరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలు వచ్చినపుడు మాత్రమే టీఆర్ఎస్ ప్రభుత్వానికి, దళిత బంధు, రైతు బంధు, వద్ధాప్య పింఛన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు గుర్తుకొస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఏడేండ్లుగా ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ ప్రగతిభవన్ను వీడి ప్రజల అవస్థలు గమనించాలన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన మూడు సభలతోనే టీఆర్ఎస్కు ముచ్చెటెమలు పడుతున్నాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిలుక మధుసూదన్ రెడ్డి, మెరుగు రమేష్రెడ్డి, శేఖర్రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్యామ్ చరణ్రెడ్డి, బాండ సురేందర్రెడ్డి, ముస్కార్, శరీఫ్, కిషోర్ గౌడ్, సుజాతరెడ్డి, రాజేశ్వరి, కవిత, లతాగౌడ్ పాల్గొన్నారు.