Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉన్నత విద్యామండలి చైర్మెన్
ప్రొఫెసర్ లింబాద్రి
నవతెలంగాణ-ఓయూ
హైదరాబాద్ను ఎడ్యుకేషన్ హబ్గా చేయాల్సిన అవసరం అందరిపై ఉందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ లింబాద్రి అన్నారు. ఓయూ నుంచి ఉత్తమ టీచర్స్ అవార్డ్స్ పొందిన ప్రొఫెసర్లు కరుణాకర్, జీబీ రెడ్డి, అప్పారావు, డా.హామీద బి లకు సోమవారం సాయంత్రం ఓయూ సెనేట్ హాల్లో సత్కార కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రొ. ఆర్.లింబాద్రి మాట్లాడుతూ హైదరాబాద్ను సీఎం కేసీఆర్, కేటీఆర్ ఆధ్వర్యంలో ఫార్మా, ఐటీ హబ్గా చేశారని, వారి స్ఫూర్తితో నగరాన్ని ఎడ్యుకేషన్ హబ్గా చేద్దామన్నారు. మారుతున్న కాలనుగుణంగా పరిస్థితులకు ధీటుగా సిలబస్ను మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వివిధ ప్రభుత్వ, ప్రయివేట్ రంగాల్లో మహిళలు రాణించడం హర్షణీయమన్నారు. ఓయూ వీసీ ప్రొ. రవీందర్ మాట్లాడుతూ వివిధ సంస్థల నుంచి ప్రాజెక్ట్స్ను నిధులు తీసుకు రావాల్సిన అవసరం అధ్యాపకులపై ఉందని చెప్పారు. ఓయూలో ఇండియన్ పసిఫిక్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో భాగంగా ప్రొ. లింబాద్రిని ఉత్తమ టీచర్స్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొ..పి.లక్ష్మీ నారాయణ, ఓఎస్డీ రెడ్యా నాయక్, ప్రిన్సిపాల్స్, డీన్స్, డైరెక్టర్స్, అధ్యాపకులు, బోధనేతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.