Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్ల పరిధిలోని ఎనిమిది డివిజన్లలో సీసీ రోడ్లు, భూగర్భ డ్రయినేజీల అభివృద్ధి పనులపై సోమవారం పేట్బషీరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వివిధ బస్తీలు, కాలనీలలో ఇటీవలే మంజూరైన రూ.40 కోట్లతో డ్రయినేజీ, సీసీ రోడ్ల పనులు సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదని, అవసరమైన నిధులు మంత్రి కేటీఆర్ సహకారంతో మంజూరు చేయిస్తానన్నారు. గ్రేవియార్డులలో మిగిలిన మౌలిక వసతులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఈఈ కృష్ణచైతన్య, డీఈలు పాపమ్మ, రామ్చందర్రాజు, శిరీష, ఏఈలు సురేందర్నాయక్, మల్లారెడ్డి, సంపత్, ఆశ, కల్యాణ్, సతీష్ పాల్గొన్నారు.