Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
వినాయక్నగర్ డివిజన్లోని దిన్దయాళ్ నగర్ రోడ్ నెంబర్-1లో అండర్ గ్రౌండ్ డ్రయినేజీల్లో పూడికి తీసిన కాంట్రాక్టర్లు బయటకు తీసిన మట్టిని, చెత్తను తరలించకుండా డ్రయినేజీ పక్కనే వేశారు. ఎడతెరిపిలేని వర్షాలు పడుతుండటంతో ఆ మట్టివల్ల నీరు డ్రయినేజీల్లోకి వెళ్లకుండా రివర్స్ రావడంతో కాలనీల్లోకి నీళ్లు నిలుస్తున్నాయి. కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య పరిష్కరించాలని కోరుతున్నా మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. లేకపోతే వర్షాలు, వరదలు, కలుషిత నీటితో రోగాలు ప్రబలే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.