Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అడిక్మెట్
అడిక్మెట్ డివిజన్లోని ప్రధాన రోడ్డు మార్గాలపై ఫుట్పాత్ ఆక్రమణలను జీహెచ్ఎంసీి సర్వీస్ 15 టౌన్ప్లానింగ్ అధికారులు మంగళవారం తొలగించారు. డివిజన్లోని జామేఉస్మానియా నుంచి విద్యానగర్ చౌరస్తా వరకు ఫుట్పాత్ను ఆక్రమించి కట్టడాలు నిర్మించిన వాటిని పూర్తిగా తొలగించారు. ఇదేక్రమంలో విద్యానగర్లోని ఫుట్పాత్పై చిన్నపాటి స్టాళ్లుఏర్పాటుచేసుకుని వ్యాపారం నిర్వహిస్తున్న చిరువ్యాపారులను, వారి షాపులను తొలగిస్తున్న జీహెచ్ఎంసీి సిబ్బందిని విద్యానగర్లోని బీసీ సంక్షేమ సంఘం నాయకులు అడ్డుకున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని చిరు వ్యాపారులపై అక్రమంగా జేసీబీలతో వారి వ్యాపారాన్ని కూల్చడానికి చూస్తే ఊరుకునేది లేదని జీహెచ్ఎంసీి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీనితో కాసేపు ఘటనా స్థలంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకోగా వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న టౌన్ప్లానింగ్ ఏసీపీి పావని పోలీసుల సహాయంతో బీసీ సంక్షేమ సంఘం నాయకులను సర్దిచెప్పి ప్రయత్నం చేశారు. పోలీసుల రంగప్రవేశంతో గొడవ సద్దుమణిగింది. వీధి వ్యాపారుల షాపులను వదిలేసి మిగిలిన వాటిని సిబ్బంది తొలగించారు. ఈ కార్యక్రమంలో ప్లానింగ్ అధికారులు దేవేందర్ రాందాస్ చైన్మన్లు జగన్, అనిల్, రాజయ్య పాల్గొన్నారు.