Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
మొన్నటి వరకు కరోనా భయంతో ఇళ్లకే పరిమితమైన ప్రజలు ఇప్పుడిపుడే తమ దైనందిన జీవితంలోకి అడుగుపెడుతున్నారు. కరోనా భయం ఇంకా పూర్తిగా వీడనేలేదు. మరో పక్క గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు రోగాల బారిన పడి ఆస్పత్రిపాలవుతున్నారు. ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం పరిసరాల శుభ్రత పాటించాలని ఎంత చెప్పినా కొందరు అధికారులు పెడచెవినపెడుతున్నారు. అందుకు నిదర్శనమే మంగళవారం దిల్సుఖ్నగర్ ప్రధాన రహదారిలోని ఆంధ్రా బ్యాంకు వద్ద మ్యాన్ హోల్ నుంచి పొంగిపొర్లుతున్న డ్రయినేజీ, ఆ పక్కనే చిరు వ్యాపారులు తమ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.
అటుగా వెళ్ళే వాహనదారులు, పాదచారులు డ్రయినేజీ నుంచి వస్తున్న దుర్గంధంతో తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. ఈ సందర్భంగా పలువురు జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.