Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సరూర్నగర్
సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదని గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, రచయిత, సోషల్ వర్కర్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు పెండెం కష్ణకుమార్ అన్నారు. సోమ వారం ఆర్కెపురం డివిజన్, అల్కాపురి ప్రభుత్వ పాఠశా లలో టీచర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో టీచర్స్ డే కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెండెం కష్ణకుమార్ మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర మరవలేనిదని, దేశ భవిష్యత్తు విద్యార్థులపై ఉందన్నారు.
విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో అమూల్యమైనది అన్నారు. స్టూడెంట్స్ ట్యాలెంట్ను వెలికితీసి వారిని భావితరాలకు మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా తయారు చేయాలని కోరారు. అనంతరం పాఠశాల టీచర్లను ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రం అందించడంతో పాటు స్వచ్ఛ భారత్లో భాగంగా క్లాత్ సంచులు, పాఠశాలకు గడియారం అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు, సెక్రెటరీ గండు రవీందర్, లయన్స్ మాజీ జోన్ చైర్మన్ భార్గవ రాజు, విద్యార్థిని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.