Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ కంటోన్మెంట్/ కాప్రా
ఎడతెరిపిలేని వర్షాలు, ముసురుతో సిటీలోని పలు కాలనీల్లో రోడ్లపై నీళ్లు నిలిచి రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. కొన్నిచోట్ల రోడ్లపై గుంతలు పడి ఇబ్బం దులు ఎదురవుతున్నాయి. మారేడ్పల్లిలో, చర్లపల్లిలో వర్షంతో నీళ్లు నిలిచి జనం అవస్థలు పడుతున్నారు. మారేడ్పల్లి రోడ్లు వర్షం పడ్డప్పుడు చెరువుల్ని తలపిస్తు న్నాయి. చర్లపల్లి డివిజన్ పరిధిలో శ్రీలక్ష్మీ నరసింహ కాలనీ, ఎంఆర్ఆర్ కాలనీ, ద్వారకాపురి, మధురా నగర్లకు వెళ్లే మెయిన్ రోడ్డులో వరదనీరు నిలిచింది. ఓచోట కాలనీలకు మంచినీరు సరఫరా చేసేందుకు ఉపయోగించే ఆన్ ఆఫ్ వాల్ మురుగు నీటిలో మునిగిపోయింది. నీరు కలుషితం అయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంజనీరింగ్, జలమండలి అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు, చర్లపల్లి కాలనీల సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు నరసింహ, శ్రీను డిమాండ్ చేస్తున్నారు.