Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న 73వ షెడ్యూల్ ఎంప్లాయిమెంట్లో కనీస వేతనాల జీవోను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సవరించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కంచన్బాగ్లోని బీడీఎల్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయం ఆవరణలో కార్మిక గర్జన పాదయాత్ర పోస్టర్ను ఆయన విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు నష్టం చేసే విధానాలను అవలంభించడం మానుకోవాలని, కార్మిక వ్యతిరేక జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులకోసం సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కార్మిక గర్జన పాదయాత్రను చేపట్టామని తెలిపారు. ఈనెల 9న పాదయాత్ర చాంద్రాయణగుట్ట నుంచి బాలాపూర్ చౌరస్తాకు చేరు కుంటుందన్నారు. కార్యక్రమంలో బీడీఎల్ నాయకులు బాపురావు, విజరు కుమార్, సత్తయ్య, శ్రీలక్ష్మి, సీఐటీయూ హైదరాబాద్ సౌత్జోన్ నాయకులు నాగేశ్వర్, ఎం.శ్రావణ్, ఎస్.కిషన్, పి.మురళి తదితరులు పాల్గొన్నారు.