Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
పీసీసీ రథసారథి అప్పగించిన బాధ్యతను శిరసా వహిస్తూ నాయకుల, ప్రజల వారధి గా పనిచేస్తూ కాంగ్రెస్పార్టీ అభివద్ధికి అహర్నిశలూ అందరి సమన్వయంతో పనిచేస్తూ ముందుకు వెళ్తానని టీపీసీసీ నూతన కమిటీలో అధికార ప్రతినిధిగా ఎన్నికైన సీనియర్ నాయకులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన అధికార ప్రతినిధిగా ఎన్నికైన సందర్భంగా మొదటిసారి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి నేతత్వంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో కలిసి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతి రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు బొంగులూరు శ్రీనివాస్ రెడ్డితో కలిసి అధికార ప్రతినిధి హరివర్ధన్ రెడ్డికి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భూపతిరెడ్డి మాట్లాడుతూ..కష్టపడి పనిచేసే ప్రతినాయకుని పార్టీ తప్పకుండా గుర్తింపు ఇస్తుందని 25 ఏండ్లుగా ప్రజా జీవితంలో, పార్టీసేవలో హరి వర్ధన్ రెడ్డి చేదోడువాదోడుగా ఉన్నారని గుర్తు చేశారు. పార్టీ అభివృద్ధికి పాటుపడేవారికే రేవంత్రెడ్డి గుర్తింపును ఇచ్చారని తెలిపారు. అనంతరం హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మేడ్చల్ జిల్లా నుండి అధికార ప్రతినిధిగా గుర్తించి పదవి బాధ్యతలు అప్పగించినందుకు మరింత ఉత్సాహంతో పనిచేస్తానన్నారు. తన పరిధిలో పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ఐదుగురు అధికార ప్రతినిధులలో తనకు అధికార ప్రతినిధిగా గుర్తింపు ఇచ్చిన అధ్యక్షుల వారికి ఆయన కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా సేవాదళ్ చైర్మెన్ షఫీ, మహిళా కాంగ్రెస్ నాయకురాలు అనిత, గూడ ఐలయ్య, జక్కుల మల్లేష్, టేకుల ప్రవీణ్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, యువజన నాయకుడు నవీన్ రెడ్డి, బౌరంపేట్ ప్యాక్స్ డైరెక్టర్ శ్రీను, రామకష్ణ, ఎస్స్సీ సెల్ చైర్మెన్ దాసరి మహేష్, యువజన కాంగ్రెస్ నాయకులు బత్తుల చిరంజీవి, బహదూరపల్లి పరశురాం గౌడ్, ధర్మారెడ్డి, అర్కెల విజరుగౌడ్, పోషి మహేష్, చింతకింది సురేష్, మాధవ రెడ్డి, మైనారిటీ సెల్ నాయకులు సమీర్ ఖాన్, అంజద్, గాగిల్లాపూర్ యువ నాయకులు పాల్గొన్నారు.