Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్ మెట్
కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో సుదీర్ఘ కాలం అనంతరం ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు సహాయ కార్యదర్శి మహేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాదులోని పలు ప్రభుత్వ విద్యా సంస్థలను సందర్శించి అక్కడున్నన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్నిరకాల ఏర్పాట్లతో విద్యాసంస్థలు ప్రారంభించామని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఆచరణలో భిన్నంగా ఉందన్నారు. విద్యార్థులకు ఇప్పటికీ అన్నీ టెస్ట్ బుక్స్ అందలేదన్నారు. క్లాస్ రూమ్ల శానిటేషన్ కూడా అంతంత మాత్రంగానే ఉందన్నారు. క్లాస్ లు బోధించే పూర్తిస్థాయి ఉపాధ్యాయుల కొరత ఉందన్నారు. కొవిడ్ కేర్ కు ప్రత్యేక నిధులు, వసతులు మంజూరు చేయకపోవడాన్ని బట్టి విద్యార్థులపట్ల ప్రభుత్వ విద్యారంగంపట్ల సీఎం చిత్తశుద్ధి అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకొనే విద్యార్థుల సంఖ్యపెరిగిందని స్వీట్స్ పంచుకున్న విద్యాశాఖమంత్రి మరో వైపు విద్యార్థులు లేరన్న సాకుతో పెద్దఎత్తున విద్యాసంస్థలు మూసివేతకు రేషనలైజేషన్ జీఓ 25ను తీసుకురావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వెంటనే ప్రభుత్వ విద్యా సంస్థలు మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి అనిల్, గడ్డం శ్యామ్ జిల్లా నేతలు అనిల్, వరుణ్, మహిత, మమత తదితరులు పాల్గొన్నారు.