Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
కరోనా సెకండ్వేవ్ తర్వాత ఈనెల 5న ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్స్ కొన్ని ఓపెన్ అయ్యాయి. నేటి మధ్యాహ్నం నుంచి మరికొన్ని హాస్టల్స్ ఓపెన్ కానున్నాయి. కరోనా టైమ్లో స్టూడెంట్స్ లేనప్పుడు ఇక్కడున్న సమస్యలు, మరమ్మతు పనులు పూర్తిచేస్తే ఇబ్బందే ఉండకపోయేది. పోనీ హాస్టల్స్ ఓపెనింగ్ను దృష్టిలో పెట్టుకొని చేపట్టిన డ్రయినేజీ, విద్యుత్ మరమ్మతు, నీటి సరఫరా పనులైనా పూర్తయ్యాయా అంటే అదీ లేదు. ఓ వైపు హాస్టల్స్కు స్టూడెంట్స్ వస్తున్నా మరమ్మతు పనులు పూర్తి చేయడంలో, తగిన సౌకర్యాలు కల్పించడంలో ఓయూ అధికారగణం, కాంట్రాక్టర్లు విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, ప్రిన్సిపాల్స్ సంబంధిత అధికారులతో మీటింగ్పెట్టి హాస్టల్స్ ఓపెనింగ్, నిర్వహణ తదితర అంశాలపై చర్చించడం, ఆదేశాలివ్వడం బాగానే ఉన్నా నిధులు విడుదల కాకపోవడం కూడా సమస్యలకు కారణం అవుతోంది.
మరోవైపు ఇక్కడి లేడీస్ హాస్టల్ డెరైక్టర్ డా. ఎల్. నిర్మలా దేవి, చీఫ్ వార్డెన్ డా.కొర్రెముల శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఆదివారం నాటికి హాస్టల్లో చేరేందుకు చేసుకోవాల్సిన దరఖాస్తుల గడువు ముగిసింది. 950 మంది స్టూడెంట్స్ దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అత్యధికంగా అమ్మాయిలే ఉన్నారు.
విద్యుత్ సమస్యలు
ఓయూ మెయిన్రోడ్తోపాటు ఇంటర్నల్ రోడ్స్ వెంట స్ట్రీట్లైట్లు వెలగడం లేదు. లేడీస్ హాస్టల్ 2వ బ్లాక్లో విద్యుత్ వైరింగ్ మరమ్మతులు పూర్తి చేశారు. కొన్ని హాస్టల్స్లో ఫ్యాన్స్ ఫిట్టింగ్స్, సివిల్ ఎలక్ట్రిసిటీ రిపేరింగ్, డి హాస్టల్, న్యూ పీజీ హాస్టల్స్లో విద్యుత్ మరమ్మతులకు కూడా ఎస్టిమేషన్స్ ఇచ్చినా నిధులు మంజూరుగాక పనులు మొదలు పెట్టలేదు. ఇక టెక్నాలజీ హాస్టల్ వద్ద ట్రాన్స్ఫార్మర్ కూలిపోయినా కొత్తది ఏర్పాటు చేయలే. ఈ2 హాస్టల్వద్ద చెట్లకొమ్మలు విరిగిపడి కొన్ని రూములకు పైకప్పుగా ఉన్న రేకులు పగిలిపోయాయి.
మెరాయిస్తున్న వైఫై, పనిచేయని ఇంటర్నెట్
ఓయూలో గ్రౌండ్లోనూ హాస్టల్స్లోనూ వైఫై నిత్యం వైఫై, ఇంటర్నెట్ సమస్యలు తలెత్తుతున్నాయి. సిగల్స్ సరిగ్గా ఉండటం లేదు. లేడీస్ హాస్టల్ డెరైక్టర్ డా.నిర్మలా దేవి వైఫై, అండ్ '' డెడ్ కేటెడ్ ఐపి '' కోసం పలు మార్లు సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు కానీ, సమస్య పరిష్కారం కాలేదు. ఇక ఓయూ వెబ్సైట్స్, ఇంటర్నెట్ సౌకర్యాలు యూనివర్సిటీ స్థాయికి తగ్గట్టుగా పనిచేయడం లేదు. విద్యార్థులు పరీక్షా ఫలితాలు చూసుకునేటప్పుడు, ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేటప్పుడూ తరచూ సర్వర్ బిజీ సమస్య వస్తోంది.
డ్రయినేజీ ప్రాబ్లమ్స్
కొన్ని హాస్టల్స్లో డ్రయినేజీ సిస్టమ్ సరిగ్గాలేదు. నీరు బయటకు పోకుండా నిలిచిపోయి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అవసరమైన రిపేర్లు ఇప్పటికీ చేపట్టలేదు. పీహెచ్డీ స్టూడెంట్స్ ఉండే ఎన్ఆర్ఎస్హెచ్ హాస్టల్లో నిత్యం డ్రయినేజీ లీక్ అవుతోంది. రెండేండ్లుగా నిర్వహణ సరిగ్గాలేక, వినియోగంలోలేక కొన్నిచోట్ల చెట్లు కూలి, చెట్ల వేర్లు పెరిగి డ్రయినేజీ లైన్స్ మట్టితో పూడుకుపోయాయి. కొన్నిచోట్ల మ్యాన్హోల్స్ కుంగిపోవడం, కూలిపోవడం జరిగింది. ఆర్ట్స్ కాలేజీలోని హాస్టల్స్లో డ్రయినేజీ సమస్యలు నిత్యం తలెత్తుతున్నాయి. ఆర్ట్స్ కాలేజీ, మానేరు హాస్టల్ ప్రధాన లైన్ చెట్లవేర్ల మట్టితో పూడుకుపోయింది. ఓవర్ ఫ్లోవల్ల ఓల్డ్ పీజీ నుంచి ఎన్ఆర్ఎస్హెచ్ వరకు కూడా డ్రయినేజీ స్ట్రక్ అవుతోంది. ఇక్కడ 30 మంది సిబ్బందికిగాను ప్రస్తుతానికి 8 మంది పని చేస్తున్నారు. దీనివల్ల అన్ని ఫిర్యాదులకూ వీరు అటెండ్ కాలేకపోతున్నారు. ప్రస్తుతానికి ఓయూ డ్రయినేజీ మరమ్మతులు చేపట్టాలంటే ''డ్రయినేజి క్లీనింగ్ మిషన్''తో యుద్ద ప్రాతిపదికన పనులు చేప్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరికరాలు, సబ్బులు, మెటీరియల్స్ ఇవ్వడం లేదని ,మ్యాన్ పవర్ లేదని డ్రయినేజీ సెక్షన్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీర్ఘకాలిక మరమ్మతులకోసం ప్రపోజల్స్ పెట్టినా నిధులు మంజూరు కావడం లేదని వారు అంటున్నారు. ఇక హాస్టల్స్ ఓపెన్ నేపథ్యంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.సత్తయ్య ఆధ్వర్యంలో వీసీ ఆదేశానుసారం 200 కరోనా కిట్స్ సిద్ధంగా ఉంచారు. హాస్టల్స్లో క్లీనింగ్ పనులు ఇప్పటికే చేపట్టారు. శానిటేషన్ చేస్తున్నారు. కొవిడ్ అవగాహన కోసం ప్లెక్సీలు మాత్రం ఏర్పాటు చేశారు. ప్రతి కాలేజీలో రెండు ఐసోలేషన్ రూమ్స్ను కొవిడ్ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు.
ఇక ఓయూలో పీజీ, పీహెచ్డీ హాస్టల్స్లోని డైనింగ్ హాల్ల్ న్యూస్ పేపర్స్ ఏవీ అందుబాటులో ఉండవు. కరోనా పరిస్థితుల్లో పేపర్లు పెట్టవద్దని అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఓయూ మెస్లో వంట చేసేందుకు కట్టెలు వినియోగించేవారు. ఇక నుంచి వాటి స్థానంలో వంటగ్యాస్ వినియోగించేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హాస్టల్స్ ఓపెన్ నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ ఓయూ కమిటీ ఆధ్వర్యంలో ఆ సంఘం రష్ట్ర అధ్యక్షులు మూర్తి, ఓయూ కార్యదర్శి రవినాయక్ తదితరులు పీజీ, పీహెచ్డీ హాస్టళ్లను పరిశీలించారు.