Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ఈనెల 17న కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లలో జాతీయ జెండాలను ఎగురవేయాలని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలంగౌడ్ అన్నారు. బుధవారం కుత్బుల్లాపూర్లో అసెంబ్లీ కన్వీనర్ బక్క శంకర్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 17న తెలంగాణ విమోచన దినోత్సవంలో ప్రతి డివిజన్లో జాతీయ జెండాలను ఎగురవేయాలన్నారు. నిర్మల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా సమావేశానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షులు నందనం దివాకర్, జిల్లా ఉపాధ్యక్షులు రవి, మహేష్, సెన్సార్ బోర్డు మెంబర్ నటరాజుగౌడ్, నాయకులు శ్రీనివాస్, సాయినాథ్, పున్నారెడ్డి, కంది శ్రీరాములు, పులి బలరాం, నాగేశ్వర్రావు, శేఖర్యాదవ్, కృష్ణయాదవ్, శేఖర్, రాజారెడ్డి, వెంకట్, శ్రీధర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.