Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కష్టపడి పని చేసే కార్యకర్తలకు టీఆర్ఎస్లో తగిన గుర్తింపు ఉంటుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. బుధవారం కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని గణేష్నగర్ 2 కాలనీ టీఆర్ఎస్ పార్టీ కమిటీ ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్యేను ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కాలనీలోని ప్రతి ఇంటికి తెలియజేసి పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు మాధవరెడ్డి, ఉపాధ్యక్షులు టి.ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి బి.శ్రీనివాస్, సెక్రటరీ రమ్యాకుమారి, కోశాధికారి సి.హెచ్.శ్యామ్సుందర్రావు, సభ్యులు సి.హెచ్.సుధాకర్, శ్రీనివాస్, అమిద్, నాగభూషణం, సత్యనారాయణ, రామకృష్ణ, అశోక్ యాదవ్, దుర్గ, అంజలి, తదితరులు పాల్గొన్నారు.