Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి హైటెక్సిటీలో కెర్రిమో ఇంటర్నేషనల్ ఫుడ్ స్టోర్ ప్రారంభం
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ ప్రపంచంలోని అనేక కంపెనీల పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. హైటెక్సిటీలో ఫిలిప్పైన్స్ దేశానికి చెందిన కెర్రిమో ఇంటర్నేషనల్ ఫుడ్స్టోర్ను బుధవారం మేయర్ విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కాస్మొపాలిటన్ సంస్కృతితో హైదరాబాద్ ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోందన్నారు. హైదరాబాద్ ప్రజలు భిన్న సంస్కృతులను ఎంతో ఆదరిస్తారని, పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తోందన్నారు. హైదరాబాద్లో వ్యాపారాన్ని ప్రారంభించిన కెర్రిమో కంపెనీ ప్రతినిధులను మేయర్ అభినందించారు. హైదరాబాద్లో కెర్రిమో స్టోర్ను ప్రారంభించడంలో కీలకపాత్ర పోషించిన మహిళా పారిశ్రామికవేత్తలను ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పటికే ఉత్తర భారతదేశంలో విజయవంతంగా ఫుడ్ కోర్టులను నడుపుతున్న కెర్రిమో కంపెనీ, సౌత్ ఇండియాలో తొలి స్టోర్ను హైదరాబాద్లోనే ప్రారంభించడం విశేషం. ఇండియాలో కెర్రిమో ఇంటర్నేషనల్ 8వ ఫుడ్స్టోర్ను హైదరాబాద్లో ప్రారంభించారు. సురక్షితమైన వాతావరణంలో, సౌకర్యవంతంగా ఆహారాన్ని సిద్దం చేసి అందించడం కెర్రిమో ప్రత్యేకత. హైటెక్ సిటీలో ప్రారంభించిన కెర్రిమో ఫుడ్ స్టోర్ విజయవంతం కావాలని మేయర్ విజయలక్ష్మి ఆకాంక్షించారు. కార్యక్రమంలో కెర్రిమో సంస్థ ప్రతినిధులు మోహిత్ శర్మ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.