Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ రూరల్
73 షెడ్యూల్ పరిశ్రమలలో కనీస వేతనాల జీవోల సవరణ, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని నిర్వహిస్తున్న పాదయాత్రను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎర్ర అశోక్ పిలుపునిచ్చారు. ఈమేరకు బుధవారం మేడ్చల్ పట్టణంలో పోస్టర్ రిలీజ్ చేశారు. పాదయాత్రలో కార్మికులు, కర్షకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల నాయకులు నరేష్, ప్రశాంత్, చారి, నర్సింగరావు, మెడిసిటీ యూనియన్ నాయకులు సుధాకర్, శ్రీరామ స్పిన్నింగ్ మిల్ కార్యదర్శి నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.