Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్రెడ్డి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
రాష్ట్రవ్యాప్తంగా దళిత, గిరిజనులకు దళితబంధు పథకాన్ని అమలుచేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ తోటకూర జంగయ్య యాదవు అన్నారు. ఈమేరకు బుధవారం కీసరలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోలా కృష్ణ యాదవ్, నాగారం మున్సిపాలిటీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి, దమ్మాయిగూడ మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్ప రామారావు ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత, గిరిజనులను మోసం చేయడానికే దళిత బంధు నాటకం ఆడుతోందని ఆరోపించారు.. రాష్ట్రంలో ఉన్న దళిత, గిరిజనులకు దళిత బంధు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాగారం మున్సిపాలిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లోల కుమార్, కాంగ్రెస్ నాయకులు మెరుగు ముత్యాలు, రవి, అభిలాష్, విజరు రెడ్డి, మీసాల మల్లేష్, పరిగే మహిపాల్ రెడ్డి, పొట్ట శ్రీశైలం, సమీ, రొంపి కుమార్, మీసాల భాస్కర్, ఓం ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.