Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
గణేష్ నవరాత్రులు జరుపుకోవడం ఎంత ముఖ్యమో నిమజ్జనం చేయడం అంతే ముఖ్యమని, శాంతియుత వాతావరణంలో నిమజ్జనం నిర్వహించుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. బుధవారం సాయంత్రం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం కట్టమైసమ్మ దేవాలయం ప్రాంగణంలో ఉన్న నిమజ్జనోత్సవ చెరువు (కొలను)ను బాలానగర్ జోన్ డీసీపీ పి.వి.పద్మజారెడ్డితో కలిసి పర్యవేక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వాహకులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ నిమజ్జనం చేయాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతియుత వాతావరణంలో నిమజ్జనోత్సవం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏసీపీ పురుషోత్తం యాదవ్, జీడిమెట్ల సీఐ కె.బాలరాజు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, దుండిగల్ సీఐ రమణారెడ్డి, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.