Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
భవిష్యత్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నా.. మంచి ఇంజినీరులుగా పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలన్నా.. ప్రతిరోజూ విద్యార్థులు కష్టపడి చదువుకుంటే విజయాలు సొంతం అవుతాయని సీఎంఆర్జీఐ కళాశాల కార్యదర్శి సీహెచ్ గోపాల్ రెడ్డి అన్నారు. గుండ్ల పోచంపల్లి మున్సి పాల్టీ కొండ్లకోయ పరిధిలోని సీఎంఆర్సెట్ (సీఎంఆర్ -సెట్) ఇంజినీరింగ్ కాలేజీలో భారతరత్న మోక్షగుండం విశ్వేరయ్య జయంతి సందర్భంగా బుధవారం 'ఇంజనీర్స్ డే' ను నిర్వహించారు. అంతకుముందు మంత్రి మల్లారెడ్డి కాలేజీలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్, రక్తదాన శిబిరం, హరితహారం కార్యక్రమల్లో పాల్గొని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా నూతనంగా ఇంజినీరింగ్ చదివే విద్యార్థులు, అధాప్యకులకు ఇంజనీర్స్డే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎంఆర్జీఐ కళాశాల కార్యదర్శి సీహెచ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువుకోవడం ద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు తల్లిదండ్రులకు మంచి పేరు తేగలరన్నారు. ఇంజనీర్స్ డే సందర్భగా మీరంతా ఒకరోజు గొప్ప స్థాయిలో నిలబడాలని ఆకాంక్షించారు. తెలుగు విద్యార్థులకు గొప్ప గొప్ప అవకాశాలు దక్కించుకునే సత్తా తోపాటు మంచి స్థాయికి వెళ్లగల లక్షణాలు ఉంటాయ న్నారు. అదే సమయంలో విద్యార్థులు పాఠాన్ని ప్రతిరోజూ గుర్తు ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగాలని సూచించారు. బ్లెడ్, మెడికల్, హరితహారం వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో సృజ నాత్మకత పెంపొందించేందుకు అవకాశం ఉంటుందనీ, విద్యార్థులు ఆర్యోగ పరిస్థితులు, నిలకడ ఆరోగ్యాన్ని గుర్తించవచ్చన్నారు. మెడికల్ క్యాంప్లో దంత, కండ్ల, సాధారణ సమస్యలతో పాటు బీబీ, ఈసీజీ, హెచ్బీ, డీసీ, ఆర్బీఎస్, మూత్ర పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులు రక్తదానం చేశారు. ఒకరు రక్తదానం చేయడం ద్వారా ఒక కుటుంబాన్ని నిలబెట్టిన వారవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అపోల్ ఆస్పత్రి డాక్టర్ ఆశిష్ చౌహాన్, ఇంటర్ననేషనల్ లయన్స్ క్లబ్ డీజీ విద్యాసాగర్, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ సాయిరామ్, ఆశ్విన్ క్యాన్సర్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ బి. సుధ, కళాశాల ప్రిన్సిపాల్ మేజర్ డాక్టర్ వి.ఏ. నారాయణ, మాక్రెడ్డి ఆస్పత్రి ఎండీ ప్రీతిరెడ్డి, సీఎంఆర్జీఐ సీఈవో అభినవ్రెడ్డి, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, హెచ్వోడీలు, డీన్లు, అధ్యాపకులు, విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ డాక్టర్ నాగరాజు నాయక్, టి.రోహిణి రెడ్డి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.