Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
సింగరేణి కాలనీలో ఆరేండ్ల చిన్నారిపై లైంగికదాడి, హత్యచేసిన రాజును కఠినంగా శిక్షించాలని ఐద్వా హైద్రాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి కె.నాగలక్ష్మి, సహాయ కార్యదర్శి ఆర్.అరుణజ్యోతి డిమాండ్ చేశారు. గోల్కొండ క్రాస్ రోడ్లో ఐద్వా హైద్రాబాద్ సెంట్రల్ సిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందనీ, మ హిళలపై రోజు రోజుకూ నేరాలు, హింస పెరిగిపోతుండటంతో మహిళలు తీవ్ర భయాం దోళనలకు గురవుతున్నారని తెలిపారు. ఇలాంటి ఘటనలు పోలీసుల దృష్టికి వచ్చినపుడు జాప్యం చేయకుండా సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. చిన్నారి విషయంలో కూడా పోలీసులు సత్వరం స్పందించక రాజు ఇంటిని సోదా చేయడంలో జాప్యం చేశారని తెలిపారు. మహిళలపై దాడులు, హింస పెరగడానికి మద్యం కూడా ఒక ముఖ్య కారణంగా ఉన్నా ప్రభుత్వం ఆదాయ వనరుగా భావించి అమ్మకాలను విచ్చల విడిగా ప్రోత్సహిస్తూందన్నారు. ఈ కేసులోనూ మద్యా నికి, గుడుంబాకు బానిసైన రాజు భార్యను, తల్లిని వేధించడంతో వారు అతనికి దూరంగా వెళ్లిపోయారనీ, ఇంతమందిని ఇబ్బందులకు గురిచేస్తూ మహిళలపై హింసకు కారణమవు తున్న మద్యం అమ్మకాలను ప్రభుత్వం ఇకనైనా నియంత్రించాలని డిమాండ్ చేశారు. మహిళల పట్ల గౌరవం పెంపొందించే లా ప్రభుత్వం ప్రచార కార్యక్రమాలు నిర్వహిం చాలనీ, ఇప్పటి వరకు ఒక్క మంత్రి కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం మహిళల పట్ల ప్రభుత్వ వైఖరిని తెలుపుతోందనీ, మహిళలపై హింస, లైంగికదాడి కేసులలో ప్రభుత్వం సత్వరం స్పందించి నేరస్తులకు కఠిన శిక్షలు విధించాలని కోరారు. సింగరేణి కాలనీలో హత్యకు గురైన చిన్నారి కుటుంబానికి తగిన న్యాయం చేయాల నీ, నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో మహిళ లు, పిల్లలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు.