Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
కాప్రా డివిజన్ పరిధిలోలోని శ్రీ ఎన్ క్లేవ్ ఎన్.ఆర్.ఐ. కాలనీ ఎల్లారెడ్డి గూడలో హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్బి వాటర్ వర్క్స్ పైప్ లైన్ రూ.47 లక్షల వ్యయంతో చేపట్టిన అభి వృద్ధి పనులను బుధవారం ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభా ష్రెడ్డి, స్థానిక కార్పొరేటర్ స్వర్ణ రాజు, డివిజన్ అధ్యక్షుడు సూడుగు మహేందర్రెడ్డి ప్రారంభించారు. అనంతరం శ్రీ ఎన్ క్లేవ్ ఎన్ఆర్ఐ కాలనీ ఎల్లారెడ్డి గూడ కమిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కాలనీకి సంబంధించిన సీసీ రోడ్లు, డ్రయినేజీ అభివృద్ధి పనులు చేపట్టాలని కాలనీవాసులు వినతిపత్రం సమర్పించారు. వెంటనే ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జలమండలి జీఎం జాన్ షరీఫ్, డీజీఎం కృష్ణ, ఏఈ రోహన్, అసోసియేషన్ అధ్యక్షులు ఎం.నాగే శ్వరరావు, ప్రధాన కార్యదర్శి రాఘవేంద్రారెడ్డి, మహిళా అధ్యక్షురాలు సురేఖ, మహిళా ప్రధాన కార్యదర్శి దేవి, ఎస్టీ సెల్ అధ్యక్షురాలు సరిత, మాజీ వార్డు కమిటీ సభ్యులు కొప్పుల కుమార్, శ్రీకాంత్గౌడ్, సోషల్ మీడియా ఇన్చార్జి భాస్కర్గౌడ్, బీసీ సెల్ అధ్యక్షుడు ఉష్కమల శ్రీనివాస్, గణేష్, మల్లారెడ్డి, వై చంద్రారెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు బాబురావు, కాలనీవాసులు పాల్గొన్నారు.