Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
ఎల్లాపు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా కరీంనగర్ జిల్లాకు చెందిన వీర్ల వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. శుక్రవారం సైదాబాద్లోని సంఘం కార్యాలయంలో ఎన్నికల నిర్వహణ అధికారి వీర్ల సుధాకర్ రావు అధ్యక్షతన నూతన అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈఅధ్యక్ష పదవి కోసం ప్రస్తుత అధ్యక్షుడు సంజీవరావు, వీర్ల వెంకటేశ్వరరావు పోటీపడ్డారు. ఎన్నికల్లో అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి రాష్ట్రంలోని 13 యూనిట్లకు చెందిన అధ్యక్ష ,కార్యదర్శులు 26 మంది ఉండగా 22 మంది మాత్రమే ఓటింగ్లో పాల్గొన్నారు. వీరిలో 15 మంది వీర్ల వెంకటేశ్వరరావుకు ఓట్లు వేశారు ఐదుగురు మాత్రమే సంజీవ రావు కు మద్దతు తెలుపుతూ ఓట్లు వేశారు. దీంతో ఎన్నికల నిర్వహణ అధికారి సుధాకర్ రావు వీర్ల వెంకటేశ్వరరావు రాష్ట్ర నూతన అధ్యక్షుడుగా ఎన్నికైనట్లు ప్రకటించారు. విద్య, ఆర్థిక, రాజకీయ, రంగాల్లో ఎల్లాపు కులస్తులకు రాజ్యాంగ పరంగా రావాల్సిన విధులు, నిధులు వచ్చే విధంగా ప్రభుత్వంతో పోరాడుతామని వెంకటేశ్వరరావు తెలిపారు.