Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హస్తినాపురం
నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా నడుచుకోవాలని ఎమ్మెల్సీ దయనంద్ గుప్తా అన్నారు. శుక్రవారం హస్తినాపురం డివిజన్ పరిధిలోని టీకేఆర్ కమాన్ వద్ద బెయింటబెన్ రెస్టారెంట్ను వనస్థలిపురం టీఆర్ఎస్ అధ్యక్షులు చింతల రవికుమార్ గుప్తాతో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ యువకులు వ్యాపార రంగంలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రెస్టారెంట్ నిర్వాహకులు డి. వీరేష్, హెచ్. నాగేశ్వర్ రావు లను అభినందించారు. నిపుణులైన చెఫ్లతో క్లౌడ్ కిచెన్ను ఏర్పాటు చేశామని, భవిష్యత్లో మరిన్ని ఇతర వంటకాలకు కేంద్ర బిందువుగా తమ రెస్టారెంట్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు..