Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్నగర్
ప్రముఖ సంఘ సేవకురాలు, ఎన్సీసీ ఆఫీసర్, ఫిజికల్ డైరెక్టర్ మేజర్ డి.జయసుధ యూఎస్ఏ డేస్ప్రింగ్ క్రిస్టియన్ మైనార్టీ సంస్థ నుంచి గౌరవ డాక్టరేట్కు ఎంపికైనట్లు యూనివర్శిటీ ఇండియా విభాగం డైరెక్టర్ డాక్టర్ అమోస్ జేమ్స్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలకు ఆదర్శ్ నగర్ లోని బిర్లా సైన్స్ ఆడిటోరియంలో నిర్వహించే ఇండో ఇజ్రాయెల్ ఫ్రెండ్ షిప్ అసోసియేషన్ 28వ వార్షిక కార్యక్రమంలో ఈ గౌరవ డాక్టరేట్ను ఆమెకు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. గత 20 ఏండ్లుగా ఎన్నో గొప్ప అవార్డులు అందుకుంటూ ఎన్సీసీ ఆఫీసర్, ఫిజికల్ డైరెక్టర్, కస్తూర్బా మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు. ఆమె సేవలకుగాను అమెరికా సంస్థ ఏపీఎఫ్ గ్లోబల్ పీస్ అవార్డు, మహాత్మా గాంధీ స్మారక అవార్డు, ఆచార్య శిక్షా సన్మాన్ అవార్డు, ఎక్స్ లెన్సీ అవార్డు, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ లను ఆమె సొంతం చేసుకున్నరని గుర్తు చేశారు. ఈకార్యక్రమానికి రాష్ట్ర క్రీడా శాఖ, కల్చరల్, టూరిజం శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మేజర్ డి.జయసుధకు గౌరవ డాక్టరేట్ను అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.