Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి
నవతెలంగాణ-సరూర్ నగర్
చట్టపరంగా ఎలాంటి సమస్యలు వచ్చిన సహాయం చేయడానికి న్యాయసేవాధికార సంస్థ తోడుగా ఉంటుందని రంగారెడ్డి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి అన్నారు. సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ జి రాధారాణి ఆదేశాల మేరకు శుక్రవారం నాగోల్, కొత్తపేట, ఇంజాపూర్, పీర్జాదిగూడ, కమ్మగూడ, ఎన్టీఆర్ నగర్ మార్కెట్, ఎల్బీ నగర్లోన సద్గురు ఓల్డ్ ఏజ్ హోమ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఉచిత న్యాయ సహాయం, సూచనల్, లోక్ అదాలత్పై ప్రజలకు అవగాహన కల్పించారు. చట్టపరంగా ఎలాంటి సమస్యలు వచ్చిన సహాయం చేయడానికి న్యాయసేవాధికార సంస్థ తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. మొత్తం రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో 38 క్యాంప్స్, లీగల్ ఎయిడ్ క్లినిక్లో 5 క్యాంప్ నిర్వహించారు.