Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కీసర గుట్ట శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ను ఎట్టకేలకు ప్రభుత్వం ప్రకటించింది. ఆలయ ట్రస్ట్ను మూడేండ్ల నుంచి కొత్త ట్రస్ట్ ఏర్పాటు చేయకుండా అలాగే ఉంచారు. ఈ ఏడాది జనవరి 6వ తేదీన కీసర గుట్ట ఫౌండర్ ట్రస్ట్లో ఒకరైన తాటకం నాగలింగం శర్మ ఆలయ చైర్మెన్గా ప్రమాణ స్వీకారం చేశారు. భాగ్యలక్ష్మి, నరేష్ గౌడ్, శివ కుమార్, భాస్కర్, కృష్ణారెడ్డి, మాల్లారెడ్డి, అంజయ్య గౌడ్, బాల్ రెడ్డి, శ్రవణ్ కుమార్, బుచ్చి రెడ్డి, సాయి నాథ్గౌడ్, రమేష్ యాదవ్లతో కూడిన కీసర గుట్ట ట్రస్ట్ ఏర్పాటు చేసిన అధికారులు. ఆలయ ప్రధాన అర్చకులు వెనుతలా బలరాం శర్మను ఎక్స్ ఆఫీషియో సభ్యుడిగా నియమించారు. అతి త్వరలో ఆలయ ఈఓ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కీసర గుట్ట ఆలయంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం రోజు నుంచి ఈ ట్రిస్ట్ సభ్యుల కాలపరిమితి ఏడాది పాటు ఉంటుందని అధికారులు తెలిపారు.