Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్బజార్
సేవకు సరైన గుర్తింపు దక్కాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ హక్కు చీఫ్ కమిషనర్ బుద్ధ మురళి అన్నారు. ఈఎన్టీ ఆస్పత్రి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రవిశంకర్ రచించిన 'ఓ వైద్యుడి వలపోత' పుస్తకాన్ని చర్లపల్లి జైలు సూపరింటెండెంట్ శివ శంకర్గౌడ్తో కలిసి ఆవిష్కరించారు. డాక్టర్ రవిశంకర్ వైద్య రంగంలో సేవలు అందిస్తూ ప్రజల్లో వివిధ అంశాలపై అవగాహన కల్పించేలా అద్భుతమైన రచన ఈ పుస్తకంలో కనబడుతుంది అని పేర్కొన్నారు. అనంతరం పలువురిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఐఎంఏ సిటీ అధ్యక్షులు సాయిరాం, మెడికల్ జేఏసీ చైర్మెన్ డాక్టర్ రమేష్, కన్వీనర్ డాక్టర్ పి.శ్రీనివాస్, ఉస్మానియా ఆస్పత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ సుజాత రాథో పాల్గొన్నారు.