Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయం మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం సీనియర్ అధ్యాపకులు, ప్రస్తుత ఓయూ కంట్రోలర్ ప్రొ.శ్రీరాం వెంకటేష్కు డీఆర్డీఓ వారి రూ.20లక్షల రీసెర్చ్ ప్రాజెక్టును ఇచ్చారు. సదరు ప్రాజెక్టు నిధులతో ప్రొ. వెంకటేష్ 'త్రీడి ప్రింటింగ్ ఆఫ్ సర్వో సిస్టమ్ కాంపోనెంట్ ఫర్ యూరో స్పేస్ అప్లికేషన్స్' అనే అంశంపై రెండేండ్ల పాటు పరిశోధన చేయాల్సి ఉంది. అనంతరం డిజైన్, డెవలోప్మెంట్ ప్రొడక్షన్ వీరికి అందజేయాల్సి ఉంది. గతంలో శ్రీరాం వెంకటేష్ ఐదు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్స్ను పూర్తి చేసి, త్రీడి ప్రింటింగ్ లో విశేష కృషి చేశారు. అనేక అవార్డ్స్ పొంది, వివిధ పబ్లికేషన్స్ చేశారు. ఓయూకు న్యాక్ ఉత్తమ గ్రేడ్, రుసా నిధుల కోసం విశేష కృషి చేశారు.