Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ఈనెల 24, 25, 26వ తేదీల్లో సూర్యాపేటలో జరిగే ఐద్వా 3వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వినోద పిలుపు నిచ్చారు. ఆదివారం షాపూర్నగర్లోని కార్యాలయంలో ఐద్వా కుత్బుల్లాపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో మహాసభల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈసందర్భం గా ఆమె మాట్లాడుతూ మహిళలపై హత్యలు, లైంగిక దాడులు విపరీతంగా జరుగుతున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అరికట్టే దిశగా నిర్ణయం తీసుకోవాలన్నారు. మహిళ కోడ్ బిల్లును 33 రిజర్వేషన్ బిల్లును పాస్ చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఐద్వా అధ్యక్షురాలు ఆర్.స్వాతి, ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మి, నాయకులు పి.ప్రణీత, ఎం.గీత, లావణ్య తదితరులు పాల్గొన్నారు.