Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ మహానగరంలో ఆదివారం నిర్దేశించిన ప్రదేశాలలో గణేష్ నిమజ్జనం ఎలాంటి చిన్నపాటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియు తంగా, ప్రశాంతంగా జరిగిన నేపథ్యంలో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ధన్య వాదాలు తెలిపారు. నిమజ్జన కార్యక్రమంలో పోలీస్ శాఖ, జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది, కార్మికులు, రోడ్లు, భవనాల శాఖ, ట్రాన్స్కో, హెచ్ఎండీఏ, జలమండలి, ఎంటమాలజి అధికారులు, సిబ్బంది, ఇతర శాఖ అధికారులు, సిబ్బంది 24గంటల పాటు పనిచేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా విశేష కృషి చేసినట్టు తెలిపారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రసార మాధ్యమాలు గణేష్ నిమజ్జన ప్రాముఖ్యత ప్రపంచ వ్యాప్తంగా ప్రసారం చేసినందుకు మీడియా యాజమాన్యాలతోపాటు జర్నలిస్ట్ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలిపారు.
గణేష్ నిమజ్జ నంలో తాను పాల్గొని ఏర్పాట్లను పరిశీలించడం జరిగిం దని, ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు ప్రాంతా ల్లో ఆకస్మికంగా పర్యటించి అందరినీ అప్రమత్తం చేసినట్టు తెలిపారు. బాలాపూర్, ఖైరతాబాద్ గణేష్ శోభా యాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు ఆరోగ్య వంతంగా సుఖసంతోషాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి అధ్వర్యంలో సంక్షేమ అభివద్ధి కార్య్రమాలు అమలు చేసి దేశంలోనే ఆదర్శంగా నిలువాలని కోరుకున్నట్టు మేయర్ తెలిపారు.