Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్పేట/మూడుచింతలపల్లి
అందరం సంఘటితమై ఐకమత్యంతో పోరాడితేనే హక్కులు సాధించవచ్చని మూడు చింతలపల్లి మండల మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు కటికం రాజు పటేల్ అన్నారు. మూడుచింతలపల్లి మండలం లక్ష్మపూర్ గ్రామ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం లక్ష్మపూర్, మూడుచింతలపల్లి మున్నూరు కాపుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెండు గ్రామాల మున్నూరుకాపు సంఘం నూతన కమిటీలను ఎన్నుకు న్నారు. లక్ష్మపూర్ మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడిగా లగిశెట్టి దయానందు పటేల్, ఉపాధ్యక్షులుగా అప్పాల రామరాజు పటేల్, సింగం రాజు పటేల్, ప్రధాన కార్యదర్శిగా క్యాతం రవి పటేల్, కోశాధికారిగా కవాడి రవి పటేల్, సంయుక్త కార్యదర్శిగా సింగం మధుసూదన్ పటేల్, ప్రచార కార్యదర్శిగా క్యాతం వెంకటేష్ పటేల్, కార్యదర్శిగా తోట పరమేష్ పటేల్, ముఖ్య సలహాదా రులుగా సింగం క్రిష్ణ పటేల్, లగిశెట్టి కష్ణమూర్తి పటేల్, సింగం సత్తయ్య పటేల్, సింగం జైహింద్ పటేల్, సింగం నర్సింగ్ రావు పటేల్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షులను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్ర మంలో సర్పంచ్ సింగం ఆంజనేయులు పటేల్, వట్టేము ప్రభాకర్ పటేల్, సింగం పవన్ కుమార్, బట్టు భిక్షపతి, లక్ష్మయ్య, తూము వేణుగోపాల్రావు, పరమేష్రావు, రాకేష్, నాగార్జున, అరవింద్, అశోక్, భాస్కర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.