Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
ఆదర్శ లారీ ఓనర్స్ అసోసియేషన్ వారు వైఎంసీఏ గణపతి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణపతి 111 కిలోల లడ్డూను ఆదివారం సాయంత్రం వేలం వేశారు. తుకారం గేట్ కు చెందిన శివకుమార్, వెంకట లక్ష్మి దంపతులు రూ.47 వేలకు కైవసం చేసుకున్నారు. ఆ లడ్డూను అసోసియేషన్ అధ్యక్షుడు ముత్యాలు, ప్రధాన కార్యదర్శి పేంట్శ్, కోశాధికారి సాయికుమార్ గౌడ్ కైవసం చేసుకున్న శివ కుమార్కు అందజేశారు.
ఘట్కేసర్ రూరల్ : పోచారం మున్సిపాలిటీ పరిధిలోని పోచారం పాత గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సుభాష్ చంద్రబోస్ యూత్ అసోసియేషన్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఆదివారం జరిగిన లడ్డు వేలం పాట మొట్ట మొదటి సారి అత్యధి కంగా రూ.లక్షా 51 వేలకు భాస్కర్రెడ్డి దక్కించుకున్నట్టె నిర్వహకులు తెలిపారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తొమ్మిది రోజులుగా పూజల అందుకున్న గణపయ్య ఆశీర్వాదాలు పొందడానికి లడ్డు వేలం పాటలో దక్కించుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చెరుకు బద్రినారాయణగౌడ్, నాయకులు బద్దం శ్రీనివాస్రెడ్డి, సామల శ్రీనివాస్రెడ్డి, నరేష్, మధు, సామ ల సత్తిరెడ్డి, యూత్ సభ్యులు ధనుష్గౌడ్, ఆదర్శగౌడ్, అభిలాష్గౌడ్, బాబు, శ్రావన్గౌడ్ పాల్గొన్నారు.