Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
విశ్వకర్మలకు పోలీసులకు సంబంధించిన చట్టపరమైన సమస్యలు ఉంటే పరిశీలించి పరిష్కరిస్తామని రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణ సంఘ గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎల్. వెంకటాచారి అధ్యక్షతన రవీంద్రభారతిలో గురువారం ఉదయం జరిగిన రాష్ట్ర ప్రథóమ మహాసభలో విశ్వకర్మ వత్తి చేరుకొనే వారిపై చట్టంలోని కొన్ని లొసుగులు వల్ల దొంగ బంగారం కేసులు మోపుతున్నారని హోమ్ మంత్రి దష్టికి పలువురు తీసుకువెళ్లారు. మహమూద్ అలీ మాట్లాడుతూ విశ్మకర్మల్లోని ఉపకులాలు కూడా కలిసికట్టుగా ఉండాలని సూచించారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ధూప దీప నైవేద్యాలు పూజారుల భతి మంజూరు చేసిందని, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాలు ఇంకా మిగిలివుంటే వాటికి మంజూరు చేస్తామని తెలిపారు. సాంస్కతిక పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కుల వత్తులు కార్పొరేట్ వ్యవస్థల వల్ల దెబ్బ తింటున్నాయని అన్నారు. నాగలి, కొడవలి, తలుపులు, శిల్పాలు ఇలా అన్నీ తయారు చేసి నాగరికత నేర్పింది ఈ కులాల వారేనన్నారు. ముఖ్య మంత్రి ఆత్మగౌరవ భవన్ నిర్మాణానికి కోక పేటలో భూమి కేటా యించి ఎనభై కోట్ల అన్ని ఉప కులాలకు మంజూరు చేశారని గుర్తుచేశారు. ఆత్మ గౌరవ భవన్ శంకుస్థాపన త్వరలో చేస్తామన్నారు. అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదన చారి తదితరులు పాల్గొన్న సభలో మదన్ మోహన్ రాష్ట్ర అధ్యక్షులుగా, కష్ణమాచారి ప్రధాన కార్యద ర్శిగా, ఫణి రవీంద్రాచారి కోశాధికారిగా ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.