Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణ భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యల పరిష్కారానికి అక్టోబర్ 4న లేబర్ కమిషనర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంగూరి రాములు తెలిపారు. శుక్రవారం తెలంగాణ భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ముషీరాబాద్ నియోజకవర్గలోని లేబర్ అడ్డాల వద్ద కరపత్రాలు పంచుతూ పోస్టర్ ఆవిష్కరించారు. గత రెండేండ్లుగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి జనజీవనాన్ని అతలాకుతలం చేసిందని, సడెన్ లాక్డౌన్తో భవన నిర్మాణ రంగ కార్మికులు పనులు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదల, ప్రభుత్వ సంక్షేమ బోర్డ్ నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందక , పెండింగ్ లో ఉన్న క్లైమ్స్ కు బోర్డ్ నుండి నిధులు అందక భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్మిక సంక్షేమ బోర్డ్ లో పెండింగ్లో ఉన్న క్లైమ్స్ పరిష్కరించి నిధులు విడుదల చేయాలని, కార్మిక సంఘాల ప్రతినిధులతో రాష్ట్ర సంక్షేమ బోర్డ్ అడ్వయిజరీ కమిటీ నియమించాలని డిమాండ్ చేశారు. కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తదితర సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 4న చలో లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నగర కార్యదర్శి పుల్లారావు, ముషీరాబాద్ జోన్ కన్వీనర్ జి.రాములు, బోలక్పూర్ అడ్డా కార్యదర్శి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.