Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
సీతాఫలమండి డివిజన్ ఉప్పర్ బస్తీలో రబ్బర్ స్పీడ్ బ్రేకర్ ఏర్పాట్లు చేస్తున్నట్లు కార్పొరేటర్ సామల హేమ తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రోడ్లపై జరిగే ప్రమాదాలను దష్టిలో పెట్టుకొని రూ.4లక్షల వ్యయంతో స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశామన్నారు. అలాగే మేడిబావి ప్రాంతంలో అధికారులతో కలిసి పర్యటించారు. సీవరేజీ లైన్ పనులను పూర్తి చేయాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో అధికారులు ఏఈ మధురిమ, టీఆర్ఎస్ నాయకులు శైలేందర్, అశోక్, హరి, చందు తదితరులు పాల్గొన్నారు.