Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
వేర్వేరు సంఘటనలో ఇద్దరు అదృశ్యమైన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అల్విన్కాలనీకి చెందిన మాధవరెడ్డి (60) గత నెల 23న తన భార్యకు బయటకు వెశ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అతని ఆచూకీ కోసం తెలిసిన వారి వద్ద, బంధువుల వద్ద వెతికిన ఫలితం లేకపోవడంతో అతని కుమారుడు కార్తీక్ జగద్గిరిగుట్ట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరో సంఘటనలో ...
కొంపల్లి ఎన్సిఎల్ కాలనీలో నివాసం ఉండే షరీఫ్ (23) ఎల్లమ్మబండలోని అంజనీ హౌమ్కేర్లో కేర్ టెకర్గా నెల రోజుల క్రితం జాయిన్ అయ్యాడు. అక్కడి నుంచి కృష్ణనగర్లోని ఓ ఇంట్లో పనికి పెట్టాడు. అయితే కుటుంబ సభ్యులు అతని ఫోన్కు గత నెల 29న ఫోన్ చేస్తే రింగ్ అయి కట్ అయింది. అతరువాత స్వీచ్చ్ ఆఫ్ వచ్చింది, అతని సోదరుడు ఎస్కె.కలాం షరీఫ్ ఎల్లమ్మబండలోని అంజనీ హౌమ్కేర్ సెంటర్లో తన తమ్ముడి గురించి అడుగగా సాలారీ విషయంలో గొడవ పడి వెళ్ళిపోయాడని తెలపడంతో అతని ఆచూకి కోసం చుట్టూ పక్కల, బంధువుల వద్ద వెతికిన ఫలితం లేకపొయింది. దీంతో జగద్గిరిగుట్ట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.