Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్ బజార్
తెలంగాణ సారస్వత పరిషత్ లో ఆల్టర్నేటివ్ మెడికల్ ఎక్స్లెంట్ స్టార్ అవార్డ్స్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ప్రభుత్వ న్యూఢిల్లీ సలహాదారు సముద్రాల వేణుగోపాలచారి హాజరయ్యారు. ఈకార్యక్రమంలో వివిధ రంగాల్లో ప్రతిభావంతులకు అవార్డుల అందించారు. సుప్రసిద్ధులు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ విజరు కుమార్ షా మాట్లాడుతూ. మన పురాతన కాలం నుంచి చాలా రకాల వైద్యం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వాటిని మనం సరిగా ఉపయోగించుకుని అందరికీ చేరువ అయ్యేలా చెయ్యాలి దానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి అని అన్నారు. ఆల్టర్నేటివ్ మెడిసిన్లో కషి చేసినవారికి, కోవిడ్ సమయంలో ప్రాణాలను సహితం లెక్క చేయకుండా వైద్యం చేసిన డాక్టర్లకు, ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన సేవాసంస్థలు, మహిళలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ, షణ్ముగవేద సిద్ధవేద వైస్ ఛాన్సలర్ చందు, పి,శైలజా, సుధా జైన్ గారు , ఆస్రా కన్స్యూమర్ ఆర్గనైజషన్ ఫౌండర్ , చీఫ్ పేట్రన్ సుల్తాన్ అలీ, రవీంద్ర కపాడియా, సంతోష్ కుమార్ కర్లేటి, మిల్లెట్ రాంబాబు, శైలేంద్ర సాగా దైవజ్ఞ శర్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని వంశీ హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్ ఆయుర్ యోగ ముద్ర వెల్నెస్ సిద్దవేత ట్రాన్స్ డిసిప్లినరీ స్టడీస్ వారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయకుమార్ షాకు సిద్దవేత యూనివర్సిటీ వారు డాక్టరేట్ ప్రదానం చేశారు. సూర్యదేవర రాజు గారి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందకున్నారు. ఈ కార్యక్రమాన్ని వంశీ, చందు పి,అభినవ్,అభిషేక్,శేఖర్, భాను, వెంకట్ ఇతరులు పర్యవేక్షించారు.