Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను టీఎన్జీవోస్ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎస్.ఎం.హుస్సేని(ముజీబ్) ఆధ్వర్యంలో శనివారం నాంపల్లి గృహకల్ప కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముజీబ్ మాట్లాడుతూ గాంధీ అహింసా మార్గంలో బ్రిటిష్ పాలకుల నుంచి దేశానికి స్వాతంత్య్రం సాధించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. దేశం బాగుపడాలంటే చిన్న గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందాలని మహాత్ముడి ఆలోచనగా ఉండేదని ఆయన గుర్తుచేశారు. క్రమశిక్షణ, ఐకమత్యం దేశానికి నిజమైన బలం అని చాటిచెప్పిన స్వాతంత్ర సమరయోధులు, భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి అని ముజీబ్ కొనియాడారు. కార్యక్రమంలో సెంట్రల్ యూనియన్ అసోసియేట్ అధ్యక్షురాలు ఉమాదేవి, జిల్లా కార్యదర్శి ఎస్.విక్రమ్ కుమార్, సభ్యులు రాజ్ కుమార్, మురళి రాజ్, కుర్రాడి శ్రీనివాస్, ఖాలీద్ అహ్మద్, శంకర్, సుజాత, గీత, సయ్యద్ జహంగీర్ పాషా, సయ్యద్ క్హుతుబద్దీన్, ఈఎన్టీ రాజు, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.