Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ఎనిమిది రోజుల కిందట నాలాలో పడి గల్లంతైన మోహన్రెడ్డి ఆచూకీ కోసం ఆదివారం జీహెచ్ఎంసీ, మాన్సూన్ టీమ్, శానిటేషన్ సిబ్బంది, ఇంజినీరింగ్ సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈసందర్భంగా ఆదివారం టీఆర్ఎస్ యువ నాయకులు కె.పి.విశాల్గౌడ్ సందర్శించి పరిశీలించారు. కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ సర్కిల్ ఎఈ సురేందర్ నాయక్, శానిటేషన్ సూపర్వైజర్ రవి, జీహెచ్ఎంసీ మాన్సూన్ టీం, శానిటేషన్ సిబ్బంది , యువనేస్తం ఫౌండేషన్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.