Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏసీ గార్డ్స్ ఏడీఈ నరసింహారెడ్డి
నవతెలంగాణ-మెహదీపట్నం
విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించి సంస్థ మనుగడకు తోడ్పడాలని ఏసీ గార్డ్స్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజిర్ నరసింహారెడ్డి వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఏసీ గార్డ్స్లోని తన కార్యాలయంలో మాట్లాడుతూ టీఎస్ఎస్పీడీసీఎల్ సంస్థ వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు. తమ సంస్థ ఉద్యోగులు రేయనక పగలనక కష్టపడుతూ వినియోగదారులకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు నిరంతరం కషి చేస్తున్నారన్నారు. వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించినట్లైతే తమ సంస్థకు ఎంతో తోడ్పాటునందించినవారవుతారని తెలియజేశారు. దీనివల్ల వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలందించడానికి తమకు వీలవుతుందని అభిప్రాయపడ్డారు.