Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
జంగ్సైరన్లో నిరుద్యోగులపై పోలీసుల లాఠీచార్జి, అరెస్టులను ఖండిస్తూ విద్యార్థి నిరుద్యోగ చైర్మెన్ చనగాని దయాకర్ ఆధ్వర్యంలో ఆదివారం ఓయూలో సీఎం కేసీఆర్, కేటీఆర్ ల బొమ్మల దగ్ధం చేశారు. తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారికి నివాళులు అర్పించే హక్కు కూడా లేకుండా కేసీఆర్ నిరుద్యోగులపై విచక్షణ రహితంగా దాడి చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగుల అడగడం కూడా నేరమేనా అని చనగాని దయాకర్ ప్రశ్నించారు. ప్రతీ ఊరు, పల్లెల్లో నిరుద్యోగ జంగ్ సైరన్ జరపాలని, కాంగ్రెస్ జెండా అందరికీ అండగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విద్యార్ది నాయకులు మేడ శ్రీనివాస్, రమేష్, సైదుల్, సత్యనారాయణ, సూర్య సాగర్, మానేరు న్యూ గోదావరి విద్యార్థులు పాల్గొన్నారు.