Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
ఈనెల 4న జరగనున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పరిధిలో భవన నిర్మాణ కార్మికులు గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈసందర్భంగా సీఐటీయూ సీనియర్ నాయకుడు వెంకట్ నర్సయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్బారావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు శ్రమించి జమచేసుకున్న నిధులు రూ. 1000 కోట్లు ఇతర రంగానికి కేటాయించటం సబబుకాదన్నారు. కార్మిక నుంచి వచ్చే నిధులను ఆ రంగంలో పని చేసే కార్మికులకు మాత్రమే కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కార్యకర్తలు నాగభూషన్, అంజి, పవన్, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.