Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
కష్టపడే కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళలా గౌరవిస్తుందని అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. ఈ మేరకు ఆదివారం రాత్రి గోల్నాక డివిజన్ పరిధిలోని తులసి నగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ ఆధ్వర్యంలో అంబర్ పేట నియోజకవర్గంలో ఐదు డివిజన్ల అధ్యక్షులను ప్రకటించారు. అంబర్పట డివిజన్ అధ్యక్షులు సిద్ధార్థ్ ముదిరాజ్, గోల్నాక డివిజన్ అధ్యక్షులుగా, కొమ్ము శ్రీను, బాగ్ అంబర్ పేట డివిజన్ అధ్యక్షుడిగా చంద్రమోహన్, కాచిగూడ అధ్యక్షుడిగా భీష్మ, నల్లకుంట అధ్యక్షుడిగా, మేడి ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటేష్ మాట్లాడుతూ పార్టీ అభివద్ధి కోసం ప్రతి ఒక్కరు కషి చేయాలని కష్టపడే కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో అంబర్ పేట కార్పొరేటర్ విజరు కుమార్ గౌడ్ సీనియర్ నాయకులు బి. లింగం గౌడ్, భాస్కర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.